అమెరికా టారిఫ్ల పెంపు పై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- September 09, 2025
న్యూ ఢిల్లీ: అమెరికా ప్రభుత్వం దిగుమతులపై సుంకాలను పెంచినప్పటికీ, భారత జీడీపీ పై వాటి ప్రభావం తక్కువగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కేవలం ఎగుమతులపైనే ఆధారపడదని, దేశీయ వినియోగ మార్కెట్ బలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని ఆయన తెలిపారు.
టెక్స్టైల్ రంగంపై కొంత ప్రభావం ఉండొచ్చు
ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గోయల్ మాట్లాడుతూ, అమెరికా పెంచిన టారిఫ్లు కొన్ని రంగాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం ఈ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముందని తెలిపారు. అయినప్పటికీ, దీన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గోయల్ తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్లు తగ్గినందున ప్రజల వద్ద ఖర్చు చేయగలిగే డబ్బు పెరిగిందని చెప్పారు. ఇది వినియోగాన్ని ప్రోత్సహించి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
మోదీ నాయకత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది
గత పదకొండు ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని గోయల్ తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా వృద్ధికి బలమైన పునాది వేసాయని చెప్పారు. “నన్ను నిద్రలేపేది ట్రంప్ కాదు… ప్రజల కోసం పని చేయాలన్న మోదీ గారి సంకల్పమే” అని ఆయన హాస్యంగా వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయనీ, రెండు దేశాలు బలమైన భాగస్వాములని గోయల్ పేర్కొన్నారు. వాణిజ్యంపై చర్చలు కొనసాగుతున్నాయని, మంచి విషయాలు జరగాలంటే సమయం పడుతుందని తెలిపారు. బీజింగ్లో ఇటీవల జరిగిన ఎస్సీవో సమావేశంలో ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత కలిగినవిగా మారాయి.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!