అమెరికా టారిఫ్ల పెంపు పై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
- September 09, 2025
న్యూ ఢిల్లీ: అమెరికా ప్రభుత్వం దిగుమతులపై సుంకాలను పెంచినప్పటికీ, భారత జీడీపీ పై వాటి ప్రభావం తక్కువగా ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కేవలం ఎగుమతులపైనే ఆధారపడదని, దేశీయ వినియోగ మార్కెట్ బలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని ఆయన తెలిపారు.
టెక్స్టైల్ రంగంపై కొంత ప్రభావం ఉండొచ్చు
ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గోయల్ మాట్లాడుతూ, అమెరికా పెంచిన టారిఫ్లు కొన్ని రంగాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం ఈ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముందని తెలిపారు. అయినప్పటికీ, దీన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గోయల్ తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్లు తగ్గినందున ప్రజల వద్ద ఖర్చు చేయగలిగే డబ్బు పెరిగిందని చెప్పారు. ఇది వినియోగాన్ని ప్రోత్సహించి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
మోదీ నాయకత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది
గత పదకొండు ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడిందని గోయల్ తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన సంస్కరణలు దేశ వ్యాప్తంగా వృద్ధికి బలమైన పునాది వేసాయని చెప్పారు. “నన్ను నిద్రలేపేది ట్రంప్ కాదు… ప్రజల కోసం పని చేయాలన్న మోదీ గారి సంకల్పమే” అని ఆయన హాస్యంగా వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు
భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయనీ, రెండు దేశాలు బలమైన భాగస్వాములని గోయల్ పేర్కొన్నారు. వాణిజ్యంపై చర్చలు కొనసాగుతున్నాయని, మంచి విషయాలు జరగాలంటే సమయం పడుతుందని తెలిపారు. బీజింగ్లో ఇటీవల జరిగిన ఎస్సీవో సమావేశంలో ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత కలిగినవిగా మారాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







