యూఏఈ పై భారత్ ఘన విజయం
- September 11, 2025
అబుధాబి: ఆసియా కప్ 2025లో భారత్ బోణీ కొట్టింది.తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 13.1 ఓవర్లలోనే 57 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 4.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔటయ్యాడు.గిల్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు. మరో 93 బంతులు మిగిలి ఉండగానే..టార్గెట్ ని ఫినిష్ చేసేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ చెలరేగాడు.4 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. మరో ఎండ్ లో శివమ్ దూబె వణికించాడు.3 వికెట్లు తీసుకున్నాడు.బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
భారత్ తన నెక్ట్స్ మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ 14వ తేదీన జరగనుంది.
స్కోర్లు..
యూఏఈ–13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్
భారత్–4.3 ఓవర్లలో 60 పరుగులు
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









