పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- September 11, 2025
మస్కట్: “క్లైమేట్ ల్యాండ్స్కేప్ అనాలిసిస్” అధ్యయనం కోసం టెక్నికల్ స్టీరింగ్ కమిటీ తన నివేదికను ఆమోదించింది. ఒమన్లోని యునిసెఫ్ కార్యాలయం సహకారంతో ఎన్విరాన్మెంట్ అథారిటీ తయారు చేసిన ఈ నివేదిక.. ఒమన్ సుల్తానేట్లోని పిల్లలు మరియు యువతపై వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేశారు.
జాతీయ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక సిఫార్సులు ఈ నివేదికలో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో దీనిని అడ్డుకునేందుకు ఇది వివిధ రంగాల మధ్య సహకారం అవసరమని ప్రస్తావించారు. ముఖ్యంగా వైకల్యం ఉన్న పిల్లలు వంటి అత్యంత దుర్బల వర్గాలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
ఏడు నెలల పాటు సాగిన ఈ నివేదిక తయారీలో ఐదు గవర్నరేట్లలోని వివిధ కమ్యూనిటీలు పాల్గొన్నాయని ఒమన్లోని యునిసెఫ్ ప్రతినిధి సుమైరా చౌదరి తెలిపారు. వాతావరణ మార్పులు పిల్లలపై ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. భవిష్యత్ తరాలను సన్నద్ధం చేయడానికి ఒమన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునిసెఫ్ సిద్ధంగా ఉందన్నారు. బ్రెజిల్లో జరిగే COP30 సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









