పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- September 11, 2025
మస్కట్: “క్లైమేట్ ల్యాండ్స్కేప్ అనాలిసిస్” అధ్యయనం కోసం టెక్నికల్ స్టీరింగ్ కమిటీ తన నివేదికను ఆమోదించింది. ఒమన్లోని యునిసెఫ్ కార్యాలయం సహకారంతో ఎన్విరాన్మెంట్ అథారిటీ తయారు చేసిన ఈ నివేదిక.. ఒమన్ సుల్తానేట్లోని పిల్లలు మరియు యువతపై వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేశారు.
జాతీయ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భవిష్యత్తు ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక సిఫార్సులు ఈ నివేదికలో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో దీనిని అడ్డుకునేందుకు ఇది వివిధ రంగాల మధ్య సహకారం అవసరమని ప్రస్తావించారు. ముఖ్యంగా వైకల్యం ఉన్న పిల్లలు వంటి అత్యంత దుర్బల వర్గాలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
ఏడు నెలల పాటు సాగిన ఈ నివేదిక తయారీలో ఐదు గవర్నరేట్లలోని వివిధ కమ్యూనిటీలు పాల్గొన్నాయని ఒమన్లోని యునిసెఫ్ ప్రతినిధి సుమైరా చౌదరి తెలిపారు. వాతావరణ మార్పులు పిల్లలపై ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. భవిష్యత్ తరాలను సన్నద్ధం చేయడానికి ఒమన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునిసెఫ్ సిద్ధంగా ఉందన్నారు. బ్రెజిల్లో జరిగే COP30 సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









