అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- September 11, 2025
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఖతార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిరి దివాన్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య బలమైన సోదర సంబంధాలను మరియు వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఖతార్ తీసుకునే నిర్ణయాలకు యూఏఈ మద్దతుగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఇజ్రాయెల్ దాడి ఖతార్ సార్వభౌమత్వాన్ని, అన్ని అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని సాధించడానికి అమీర్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అంతకుముందు యూఏఈ ప్రెసిడెంట్ దౌత్య బృందాన్ని అమీర్ ఘనంగా స్వాగతించారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!