అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- September 11, 2025
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఖతార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిరి దివాన్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య బలమైన సోదర సంబంధాలను మరియు వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఖతార్ తీసుకునే నిర్ణయాలకు యూఏఈ మద్దతుగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఇజ్రాయెల్ దాడి ఖతార్ సార్వభౌమత్వాన్ని, అన్ని అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని సాధించడానికి అమీర్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అంతకుముందు యూఏఈ ప్రెసిడెంట్ దౌత్య బృందాన్ని అమీర్ ఘనంగా స్వాగతించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









