అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- September 11, 2025
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఖతార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిరి దివాన్లో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య బలమైన సోదర సంబంధాలను మరియు వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు.
తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దాడిని ఖండించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఖతార్ తీసుకునే నిర్ణయాలకు యూఏఈ మద్దతుగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఇజ్రాయెల్ దాడి ఖతార్ సార్వభౌమత్వాన్ని, అన్ని అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని సాధించడానికి అమీర్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అంతకుముందు యూఏఈ ప్రెసిడెంట్ దౌత్య బృందాన్ని అమీర్ ఘనంగా స్వాగతించారు.
తాజా వార్తలు
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!









