ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- September 12, 2025
మనామా: ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇకపై ఫుడ్ ట్రక్కులను బహ్రెయిన్ లు మాత్రమే నడపాలని నిర్దేశించారు. జంక్షన్ల నుండి 50 మీటర్ల దూరంలో నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు మాత్రమే వ్యాపారం చేయాలని పార్లమెంట్ ముందున్న ముసాయిదా బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లును ఎంపీలు ఖలీద్ బువానాక్, అహ్మద్ అల్ సల్లూమ్ మరియు హిషామ్ అల్ అవధి ప్రతిపాదించారు.
దరఖాస్తుదారులు బహ్రెయిన్కు చెందినవారు అయి ఉండాలని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి ఆమోదాలు పొందాలని నిబంధనల్లో చేర్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్లో ఫుడ్ ట్రక్కులను నమోదు చేసుకోవాలని, వాహనం పార్కింగ్ కోసం మున్సిపల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వాహనం దాని వాణిజ్య పేరు, వాణిజ్య రిజిస్ట్రేషన్ నంబర్ను అందరికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









