ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- September 12, 2025
మనామా: ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇకపై ఫుడ్ ట్రక్కులను బహ్రెయిన్ లు మాత్రమే నడపాలని నిర్దేశించారు. జంక్షన్ల నుండి 50 మీటర్ల దూరంలో నిర్వహించాలని, ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు మాత్రమే వ్యాపారం చేయాలని పార్లమెంట్ ముందున్న ముసాయిదా బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లును ఎంపీలు ఖలీద్ బువానాక్, అహ్మద్ అల్ సల్లూమ్ మరియు హిషామ్ అల్ అవధి ప్రతిపాదించారు.
దరఖాస్తుదారులు బహ్రెయిన్కు చెందినవారు అయి ఉండాలని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ నుండి ఆమోదాలు పొందాలని నిబంధనల్లో చేర్చారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్లో ఫుడ్ ట్రక్కులను నమోదు చేసుకోవాలని, వాహనం పార్కింగ్ కోసం మున్సిపల్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వాహనం దాని వాణిజ్య పేరు, వాణిజ్య రిజిస్ట్రేషన్ నంబర్ను అందరికి కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









