వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- September 12, 2025
కాణిపాకం: దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జరిగిన కల్పవృక్షవాహనసేవ సందర్భంగా ఉభయదారులచే స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు.ఈమేరకు ఉభయదారులైన దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాబిషేకంను నిర్వహించారు.
ఈమేరకు ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వందలాది మంది మంగళవాయిద్యాలు, కేరళవాయిద్యాలు, నవదుర్గ వేషధారణలు, విచిత్ర వేషాలు, తత్పెట గుళ్ళు వంటి ప్రత్యేక వైవిధ్యభరితమైన సాంస్కతిక ప్రదర్శనల నడుమ మణికంఠేశ్వరాలయం నుండి అష్టోత్తర శత కలశాలను గ్రామపురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో వుంచి అష్టోత్తర శత కలశాలలోని పాలతో ఘనంగా అభిషేకించారు. అలాగే పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి చతుర్వేద పారాయణం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. అనంతరం వేదపండితులు మంత్రపుష్పం గావించారు. ఈకార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, డిప్యూటీ ఈఓ సాగర్బాబు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరెండెంట్లు శ్రీధరాబాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబులతో పాటు ఆలయ, ఉత్సవ ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!