వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- September 12, 2025
కాణిపాకం: దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం జరిగిన కల్పవృక్షవాహనసేవ సందర్భంగా ఉభయదారులచే స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకంను ఘనంగా నిర్వహించారు.ఈమేరకు ఉభయదారులైన దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది స్వామివారికి అష్టోత్తర శత కలశ క్షీరాబిషేకంను నిర్వహించారు.
ఈమేరకు ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వందలాది మంది మంగళవాయిద్యాలు, కేరళవాయిద్యాలు, నవదుర్గ వేషధారణలు, విచిత్ర వేషాలు, తత్పెట గుళ్ళు వంటి ప్రత్యేక వైవిధ్యభరితమైన సాంస్కతిక ప్రదర్శనల నడుమ మణికంఠేశ్వరాలయం నుండి అష్టోత్తర శత కలశాలను గ్రామపురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో వుంచి అష్టోత్తర శత కలశాలలోని పాలతో ఘనంగా అభిషేకించారు. అలాగే పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి చతుర్వేద పారాయణం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించారు. అనంతరం వేదపండితులు మంత్రపుష్పం గావించారు. ఈకార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, డిప్యూటీ ఈఓ సాగర్బాబు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరెండెంట్లు శ్రీధరాబాబు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, చిట్టిబాబులతో పాటు ఆలయ, ఉత్సవ ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









