శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

- September 12, 2025 , by Maagulf
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

తిరుమల: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

ఆమె ఆలయానికి చేరుకున్న వెంటనే టిటిడి అదనపు ఈఓ చి.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత తీర్థప్రసాదాలు, స్వామివారి లామినేటెడ్‌ ఫోటోను ఆలయ అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా సివిఎస్ఓ మురళీ కృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం,భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com