అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- September 13, 2025
వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని అమెరికాలో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ హెచ్ఇ జె.డి. వాన్స్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి హెచ్ఇ మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖతార్-అమెరికా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల బలోపేతంపై సమీక్షించారు.
ఇటీవల ఖతార్ పై ఇజ్రాయెట్ దాడిని పురస్కరించుకొని అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంఘీభావాన్ని తెలియజేశారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే మిడిలీస్ట్ లో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించగలవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పడంలో ఖతార్ అవిశ్రాంత మధ్యవర్తిత్వ ప్రయత్నాలను అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభినందించారు. ఖతార్ అమెరికాకు నమ్మకమైన వ్యూహాత్మక మిత్రదేశమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఖతార్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఖతార్ ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. అమెరికాతో సన్నిహిత భాగస్వామ్యం, ఖతార్ సార్వభౌమత్వానికి అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఖతార్ పీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!







