అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- September 13, 2025
వాషింగ్టన్: ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని అమెరికాలో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ హెచ్ఇ జె.డి. వాన్స్ మరియు అమెరికా విదేశాంగ కార్యదర్శి హెచ్ఇ మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖతార్-అమెరికా మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల బలోపేతంపై సమీక్షించారు.
ఇటీవల ఖతార్ పై ఇజ్రాయెట్ దాడిని పురస్కరించుకొని అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంఘీభావాన్ని తెలియజేశారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే మిడిలీస్ట్ లో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించగలవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పడంలో ఖతార్ అవిశ్రాంత మధ్యవర్తిత్వ ప్రయత్నాలను అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభినందించారు. ఖతార్ అమెరికాకు నమ్మకమైన వ్యూహాత్మక మిత్రదేశమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఖతార్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఖతార్ ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. అమెరికాతో సన్నిహిత భాగస్వామ్యం, ఖతార్ సార్వభౌమత్వానికి అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఖతార్ పీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







