జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- September 16, 2025
దోహా: గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సభ్య దేశాల ప్రతినిధులతో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సమావేశం నిర్వహించారు. షెరాటన్ దోహా హోటల్లో అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా వీరు సమావేశం అయ్యారు.
ఇందులో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ ఎం షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిసిసి సెక్రటరీ జనరల్ హెచ్ ఎం జాసిమ్ మొహమ్మద్ అల్ బుదైవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఖతార్ కు తమ మద్దతు కొనసాగుతుందని జీసీసీ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









