జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- September 16, 2025
దోహా: గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సభ్య దేశాల ప్రతినిధులతో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సమావేశం నిర్వహించారు. షెరాటన్ దోహా హోటల్లో అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా వీరు సమావేశం అయ్యారు.
ఇందులో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ ఎం షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిసిసి సెక్రటరీ జనరల్ హెచ్ ఎం జాసిమ్ మొహమ్మద్ అల్ బుదైవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఖతార్ కు తమ మద్దతు కొనసాగుతుందని జీసీసీ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







