జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- September 16, 2025
దోహా: గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సభ్య దేశాల ప్రతినిధులతో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సమావేశం నిర్వహించారు. షెరాటన్ దోహా హోటల్లో అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా వీరు సమావేశం అయ్యారు.
ఇందులో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ ఎం షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిసిసి సెక్రటరీ జనరల్ హెచ్ ఎం జాసిమ్ మొహమ్మద్ అల్ బుదైవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలను సమీక్షించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఖతార్ కు తమ మద్దతు కొనసాగుతుందని జీసీసీ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







