AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- September 18, 2025
మనామా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ముఖ్యమైన రంగాలలో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం పెంచేందుకు అవసరమైన చర్యలను బహ్రెయిన్లో భారత రాయబారి వినోద్ కె జాకబ్ స్వాగతించారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ, అల్మోయ్యద్ కంప్యూటర్స్ మిడిల్ ఈస్ట్ సహకారంతో బహ్రెయిన్లో సెప్టెంబర్ 14న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో బహ్రెయిన్ కు చెందిన ఐటీ, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఇండియాను సందర్శించడానికి బహ్రెయిన్ జాతీయుల కోసం ఎలక్ట్రానిక్ వీసా వ్యవస్థను ప్రారంభించినట్టు గుర్తుచేశారు. బహ్రెయిన్ మాల్లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను ప్రారంభమైందని, అలాగే కాన్సులర్ సేవలకు సంబంధించిన సేవా రుసుములపై 5 నుండి 6 శాతం తగ్గింపు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో CMF సహకారంతో ప్రాంతీయ భద్రతకు ఇండియన్ నావల్ షిప్ తార్కాష్ సహకారంతో ఇండియా-బహ్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పరిణామాలను రాయబారి జాకబ్ హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!







