బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- September 19, 2025
మానామా: బహ్రెయిన్, ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక లీగల్ మరియు ట్యాక్స్ చట్టాల బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్.. భారత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పెట్టుబడులు, చట్టపరమైన సహకారం మరియు ఆధునిక అంతర్జాతీయ వివాద పరిష్కార విధానాల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిపారు. సరిహద్దు పెట్టుబడులను ప్రోత్సహించడానికి, చట్టపరమైన సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, అదే సమయంలో ఆర్థిక వృద్ధికి దోహదపడే ప్రభావవంతమైన వివాద పరిష్కార మార్గాల అమలు చేయడానికి రెండు వైపులా వ్యూహాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అంజు రతి రాణా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రతినిధి మహదీ జాఫర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..