బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- September 19, 2025
మానామా: బహ్రెయిన్, ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక లీగల్ మరియు ట్యాక్స్ చట్టాల బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్.. భారత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పెట్టుబడులు, చట్టపరమైన సహకారం మరియు ఆధునిక అంతర్జాతీయ వివాద పరిష్కార విధానాల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిపారు. సరిహద్దు పెట్టుబడులను ప్రోత్సహించడానికి, చట్టపరమైన సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, అదే సమయంలో ఆర్థిక వృద్ధికి దోహదపడే ప్రభావవంతమైన వివాద పరిష్కార మార్గాల అమలు చేయడానికి రెండు వైపులా వ్యూహాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అంజు రతి రాణా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రతినిధి మహదీ జాఫర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









