దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- September 20, 2025
దుబాయ్: దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు కు సంబంధించి దుబాయ్లోని క్రిమినల్ మిస్డిమీనర్ కోర్టు ఒక ఆసియా వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.అతని అరబ్ సహచరుడి ద్వారా నకిలీ హోటల్ లీజు ఒప్పందం ద్వారా అరబ్ పెట్టుబడిదారుడిని 2 లక్షల 10వేల దిర్హామ్లు మోసం చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఇద్దరూ కలిసి 2 లక్షల 10వేల దిర్హామ్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పు చెప్పింది. కేసు రికార్డుల ప్రకారం, హోటల్ మేనేజర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా నటిస్తూ నిందితులు తనను మోసం చేశారని పేర్కొంటూ పెట్టుబడిదారుడు ఫిర్యాదు చేశాడు.
దుబాయ్లోని ఒక హోటల్లో మొత్తం అంతస్తును 3 లక్షల 80 వేల దిర్హామ్లు అద్దెకు తీసుకోవాలని బాధితుడిని ఒప్పించారు. 2 లక్షల 10వేల దిర్హామ్లు అడ్వాన్సుగా తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి పోస్ట్ డేట్ డ్ చెక్కు తీసుకున్నారు. 10 నుండి 20 రోజుల్లో ఫ్లోర్ ను అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, మూడు రోజుల తర్వాత వారు హోటల్ యాజమాన్యానికి ఒప్పందాన్ని ఇవ్వగా, అది నకిలీదని తేలింది. బాధితుడి నమ్మకాన్ని పొందడానికి నిందితుడు హోటల్ పెట్టుబడిదారులలో ఒకరితో కుటుంబ సంబంధాలను ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









