'తొలికిరణం' చిత్రం
- July 20, 2016
పి.డి.రాజు ఏసుక్రీస్తుగా జె.జానబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'తొలికిరణం'. అభినయ మేరీమాతగా నటించగా భానుచందర్, సాయికిరణ్, సురేఖావాణి కీలక పాత్రలు పోషించారు. టి. సుధాకర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తైంది. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఏసుక్రీస్తూ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన క్రీస్తూ చిత్రాల్లో లేని కొత్త అంశాల్ని ఇందులో చూపిస్తున్నాం. ఆయన సమాధి అయ్యి తిరిగొచ్చిన తర్వాత మానవాళికి ఎటువంటి సందేశాలిచ్చారు అన్నది ఈ చిత్రంలో కీలకం. ఇజ్రాయిల్, జెరుసలెం వంటి ప్రాంతాల్లో క్రీస్తూకి సంబంధించిన ఆధారాలను సేకరించి చిత్రాన్ని తెరకెక్కించాను. చాలా ఏళ్ల తర్వాత ఎస్.పి.బాలుగారు క్రీస్తు సినిమాకి ఓ పాట పాడారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని ఆయన చెప్పడం ఆనందం కలిగించింది. ఆగస్ట్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేసి, క్రిస్మ్సకి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









