ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- September 20, 2025
హైదరాబాద్: చందానగర్లోని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు 150వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ హాజరయ్యారు.
స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సామాజిక సేవలో భాగంగా నిరంతరంగా 150 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగించడం విశేషమని పాల్గొన్న అతిథులు ప్రశంసించారు.
హోప్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు