ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- September 20, 2025
హైదరాబాద్: చందానగర్లోని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు 150వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ హాజరయ్యారు.
స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సామాజిక సేవలో భాగంగా నిరంతరంగా 150 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగించడం విశేషమని పాల్గొన్న అతిథులు ప్రశంసించారు.
హోప్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









