ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- September 20, 2025
హైదరాబాద్: చందానగర్లోని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు 150వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ హాజరయ్యారు.
స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సామాజిక సేవలో భాగంగా నిరంతరంగా 150 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగించడం విశేషమని పాల్గొన్న అతిథులు ప్రశంసించారు.
హోప్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







