ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- September 20, 2025
హైదరాబాద్: చందానగర్లోని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈరోజు 150వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయకుమార్ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ హాజరయ్యారు.
స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సామాజిక సేవలో భాగంగా నిరంతరంగా 150 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగించడం విశేషమని పాల్గొన్న అతిథులు ప్రశంసించారు.
హోప్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చైర్మన్ కొండ విజయకుమార్ తెలిపారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







