కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- September 20, 2025
కువైట్: కువైట్ లోని హవల్లి గవర్నరేట్ లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్, మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగాలు అడ్డుకున్నాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నెట్వర్క్ కార్యకలాపాలపై అందిన సమాచారం ఆధారంగా నెట్ వర్క్ ను బస్ట్ చేసినట్లు తెలిపింది. ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధం ఉన్న ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆరుగురు ఈజిప్షియన్లు, ఒక సిరియన్ ఉన్నారు.
జనరల్ ట్రేడింగ్ సంస్థలు, డెలివరీ కంపెనీలు, హెల్త్ సెలూన్లు మరియు క్లాత్, పెర్ఫ్యూమ్ దుకాణాలతో సహా అనేక వాణిజ్య రంగాలను నెట్ వర్క్ సభ్యులు ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైందని వెల్లడించింది. టర్కీలో నివసిస్తున్న మధ్యవర్తి ద్వారా విదేశాల నుండి నిధులను మనీలాండరింగ్ చేస్తున్నారని, ప్రతిసారీ 25వేల కువైట్ దినార్ల వరకు ట్రాన్స్ ఫర్ చేసేవారని వెల్లడించారు. ఆ తర్వాత నిధులను అనధికారిక మార్గాల ద్వారా దేశంలోకి తిరిగి తీసుకొచ్చి, సభ్యులకు పంపిణీ చేసేవారని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ నెట్ వర్క్ కు చెందిన 1 లక్ష 53 వేల 837 కువైట్ దినార్లను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







