షార్జా రాజ కుటుంబంలో విషాదం
- September 23, 2025
షార్జా: షార్జా పాలకుడు, సుప్రీంకౌన్సిల్ సభ్యుడు షేఖ్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ కార్యాలయం, షార్జా రాజ కుటుంబానికి చెందిన షేఖ్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు కింగ్ ఫైసల్ మసీదులో జనాజా నమాజ్ జరగనుంది. అనంతరం ఆయనను అల్ జబీల్ స్మశానంలో ఖననం చేయనున్నారు.
అంతేకాక, సంతాప సభలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పురుషుల కోసం సంతాప స్వీకరణను షార్జాలోని అల్ రుమైల ప్రాంతంలో ఉన్న షేఖ్ ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మజ్లిస్లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
మరణవార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజుల దుఃఖచర్య ప్రకటించారు.
తాజా వార్తలు
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్







