షార్జా రాజ కుటుంబంలో విషాదం
- September 23, 2025
షార్జా: షార్జా పాలకుడు, సుప్రీంకౌన్సిల్ సభ్యుడు షేఖ్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ కార్యాలయం, షార్జా రాజ కుటుంబానికి చెందిన షేఖ్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు కింగ్ ఫైసల్ మసీదులో జనాజా నమాజ్ జరగనుంది. అనంతరం ఆయనను అల్ జబీల్ స్మశానంలో ఖననం చేయనున్నారు.
అంతేకాక, సంతాప సభలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పురుషుల కోసం సంతాప స్వీకరణను షార్జాలోని అల్ రుమైల ప్రాంతంలో ఉన్న షేఖ్ ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మజ్లిస్లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
మరణవార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజుల దుఃఖచర్య ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







