షార్జా రాజ కుటుంబంలో విషాదం
- September 23, 2025
షార్జా: షార్జా పాలకుడు, సుప్రీంకౌన్సిల్ సభ్యుడు షేఖ్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ కార్యాలయం, షార్జా రాజ కుటుంబానికి చెందిన షేఖ్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు కింగ్ ఫైసల్ మసీదులో జనాజా నమాజ్ జరగనుంది. అనంతరం ఆయనను అల్ జబీల్ స్మశానంలో ఖననం చేయనున్నారు.
అంతేకాక, సంతాప సభలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పురుషుల కోసం సంతాప స్వీకరణను షార్జాలోని అల్ రుమైల ప్రాంతంలో ఉన్న షేఖ్ ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మజ్లిస్లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
మరణవార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజుల దుఃఖచర్య ప్రకటించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..