1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!
- September 25, 2025
మస్కట్: ఒమాన్ లో ఈ-కామర్స్ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) 1,851 ఈ-కామర్స్ ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రభావితమైన వినియోగదారుల నుండి OMR24,500 కంటే ఎక్కువ రికవరీ చేసింది.
సురక్షితమైన, న్యాయమైన మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఒమన్ విజన్ 2040 వైపు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా “మైదాన్” వ్యవస్థల ద్వారా ఇప్పుడు వినియోగదారులను ఆన్లైన్లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. కేసును ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రజా సేవలను ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు.
ఇక 2025 మొదటి అర్ధభాగంలో సుల్తానేట్ అంతటా 3,141 వాణిజ్య ఉల్లంఘనలను CPA నమోదు చేసింది. వీటిలో మస్కట్ 1,363 ఫిర్యాదులో టాఫ్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నార్త్ అల్ బటినా 754, సౌత్ అల్ బటినా–బార్కా 213 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







