1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!
- September 25, 2025
మస్కట్: ఒమాన్ లో ఈ-కామర్స్ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి మరియు ఆగస్టు మధ్య వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) 1,851 ఈ-కామర్స్ ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రభావితమైన వినియోగదారుల నుండి OMR24,500 కంటే ఎక్కువ రికవరీ చేసింది.
సురక్షితమైన, న్యాయమైన మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఒమన్ విజన్ 2040 వైపు అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా “మైదాన్” వ్యవస్థల ద్వారా ఇప్పుడు వినియోగదారులను ఆన్లైన్లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. కేసును ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఇది ప్రజా సేవలను ఆధునీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా అధికారులు తెలిపారు.
ఇక 2025 మొదటి అర్ధభాగంలో సుల్తానేట్ అంతటా 3,141 వాణిజ్య ఉల్లంఘనలను CPA నమోదు చేసింది. వీటిలో మస్కట్ 1,363 ఫిర్యాదులో టాఫ్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నార్త్ అల్ బటినా 754, సౌత్ అల్ బటినా–బార్కా 213 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









