భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!
- September 25, 2025
కువైట్: కువైట్లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు పలికారు. తన మూడేళ్ల పదవీకాలంలో భారత్-కువైట్ భాగస్వామ్యం , భారతీయ ప్రవాస కమ్యూనిటీపై ఆయన బలమైన ముద్ర వేశారు. తన పదవీ కాలంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశారు. కువైట్లోని భారతీయ పౌరులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే సంస్కరణలను ప్రవేశపెట్టారు.
ఆదర్శ్ స్కైకా కాలంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 43ఏళ్ల తర్వాత కువైట్ లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హిస్ హైనెస్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మోడీకి కువైట్ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్ను ప్రదానం చేశారు. ఇది భారత్-కువైట్ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడంలో నూతన అధ్యాయాన్ని నెలకొల్పింది. ఆయన త్వరలోనే కెన్యా రిపబ్లిక్కు భారత హైకమిషనర్గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్







