'డర్టీగేమ్‌' పూజా కార్యక్రమాలను జరుపుకుంది

- July 20, 2016 , by Maagulf
'డర్టీగేమ్‌' పూజా కార్యక్రమాలను జరుపుకుంది

పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్‌'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్‌ నటుడు సురేష్‌ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్‌ నటుడు సురేష్‌ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారని నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ తెలిపారు. ఆగస్ట్‌ 4 నుండి ఈ చిత్ర షూటింగ్‌ మొదలు కానుండగా, సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నట్టు ఆయన పెర్కొన్నారు.
రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా ఈ మూవీ ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఏది డర్టీగేమ్‌? ఆ గేమ్‌ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్‌ ఏమిటి? ఆ గేమ్‌లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్‌, రొమాన్స్‌, కామెడీ మరియు ఎమోషన్స్‌ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్‌ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే అంటూ చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com