'డర్టీగేమ్' పూజా కార్యక్రమాలను జరుపుకుంది
- July 20, 2016
పూజిత, ధీరేంద్ర జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మించనున్న చిత్రం 'డర్టీగేమ్'. ఈ చిత్రం గురుపౌర్ణమిని పురస్కరించుకుని సీనియర్ నటుడు సురేష్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్ నటుడు సురేష్ ఇందులో ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారని నిర్మాత తాడి మనోహర్ కుమార్ తెలిపారు. ఆగస్ట్ 4 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చిత్రాన్ని చిత్రీకరణ జరుపనున్నట్టు ఆయన పెర్కొన్నారు.
రాజకీయ నేపథ్యంతో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండనుందని దర్శకుడు తెలిపాడు. ఏది డర్టీగేమ్? ఆ గేమ్ని ఆడింది ఎవరు? దాని రిజల్ట్ ఏమిటి? ఆ గేమ్లో గెలిచింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈ మిస్టరీని చేధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు తెలియాలంటే..సస్పెన్స్, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ సమపాళ్ళలో రంగరించిన ఈ రియలిస్టిక్ చిత్రాన్ని తెరపైన చూడాల్సిందే అంటూ చిత్ర దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









