దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- September 30, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోటగా పిలువబడే దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రారంభమైంది. 150 మిలియన్లకు పైగా పువ్వులకు నిలయంగా ఉన్న ఈ గార్డెన్ 14వ సీజన్ కోసం కొత్తగా ముస్తాబైంది.
ABBA యొక్క మమ్మా మియా పాటకు పాఠశాల మార్చింగ్ బ్యాండ్ మోగుతుండగా, యూనిఫామ్లలో ఉన్న పాఠశాల పిల్లలు.. ఐకానిక్ హార్ట్ ఆకారపు ప్రవేశ ద్వారం గుండా గార్డెన్ లోపలకు ప్రవేశించారు. గులాబీ, పసుపు, తెలుపు మరియు పర్పుల్ రంగులలో అందమైన పువ్వులతో కూడిన ఆర్ట్ వర్క్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయని మిరాకిల్ గార్డెన్ గ్రూప్ CEO మొహమ్మద్ జహెర్ హమ్మదిహ్ తెలిపారు. ఏడాది పొడవునా జాగ్రత్తగా చూసుకుంటామని, తమ దగ్గర అత్యాధునిక నీటిపారుదల వ్యవస్థ ఉందన్నారు.
కాగా, సమ్మర్ లో మొత్తం తోటను తొలగించి మళ్లీ నాటుతామని తెలిపారు. సీజన్ లో పువ్వుల థీమ్ లు ఒకటి కంటే ఎక్కువసార్లు మారుతాయని పేర్కొన్నారు. గార్డెన్ ను సందర్భించిన ప్రతిసారీ, కొత్త పూలు మరియు కొత్త మొక్కలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..







