కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- October 01, 2025
కువైట్: KNET డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎలక్ట్రానిక్ చెల్లింపులపై కువైట్లోని కస్టమర్ల నుండి అదనపు రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడాన్ని నిషేధించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని స్థానిక బ్యాంకులు, ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవా సంస్థలు, ఇ-మనీ సేవా కేంద్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్వేల ద్వారా ఉపయోగించిన సందర్ధాల్లోనూ అదనపు రుసుములను వసూలు చేయొద్దని ఆదేశించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించిన సమయంలో వ్యాపారులు కస్టమర్ల వద్ద నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులకు వ్యతిరేకంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు పాటించకపోతే సేవలను నిలిపివేయడంతోపాటు ఆయా వ్యాపార సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









