కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- October 01, 2025
కువైట్: KNET డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎలక్ట్రానిక్ చెల్లింపులపై కువైట్లోని కస్టమర్ల నుండి అదనపు రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడాన్ని నిషేధించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని స్థానిక బ్యాంకులు, ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవా సంస్థలు, ఇ-మనీ సేవా కేంద్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్వేల ద్వారా ఉపయోగించిన సందర్ధాల్లోనూ అదనపు రుసుములను వసూలు చేయొద్దని ఆదేశించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించిన సమయంలో వ్యాపారులు కస్టమర్ల వద్ద నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులకు వ్యతిరేకంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు పాటించకపోతే సేవలను నిలిపివేయడంతోపాటు ఆయా వ్యాపార సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









