కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- October 01, 2025
కువైట్: KNET డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎలక్ట్రానిక్ చెల్లింపులపై కువైట్లోని కస్టమర్ల నుండి అదనపు రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడాన్ని నిషేధించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని స్థానిక బ్యాంకులు, ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవా సంస్థలు, ఇ-మనీ సేవా కేంద్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్వేల ద్వారా ఉపయోగించిన సందర్ధాల్లోనూ అదనపు రుసుములను వసూలు చేయొద్దని ఆదేశించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించిన సమయంలో వ్యాపారులు కస్టమర్ల వద్ద నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులకు వ్యతిరేకంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు పాటించకపోతే సేవలను నిలిపివేయడంతోపాటు ఆయా వ్యాపార సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







