ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- October 07, 2025
మచిలీపట్నం: మచిలీపట్నంలో అందరికి సుపరిచితమైన ఎస్ఎస్ఆర్ ప్రైమ్ హోటల్ మరో ఘనతను సాధించింది. కృష్ణా జిల్లా టూరిజం డిపార్టుమెంట్ ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్రా అవార్డు 2025లో బెస్ట్ 2 లీఫ్ రేటింగ్ ను సాధించి, కృష్ణా, మచిలీపట్నం కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ డీకే బాలజీ(ఐఏఎస్) చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్పిటాలిటీ ఫెసిలిటీస్ లో స్వచ్చ గ్రీన్ లీఫ్ రేటింగ్స్ పేరిట అవార్డులను అందజేస్తుంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన వాటికి అవార్డులను అందించి ప్రోత్సాహిస్తుంది. ఎస్ఎస్ఆర్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ రావు తమ సంస్థకు ఈ అవార్డు దక్కడటం చాల ఆనందంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







