ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- October 07, 2025
మచిలీపట్నం: మచిలీపట్నంలో అందరికి సుపరిచితమైన ఎస్ఎస్ఆర్ ప్రైమ్ హోటల్ మరో ఘనతను సాధించింది. కృష్ణా జిల్లా టూరిజం డిపార్టుమెంట్ ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్రా అవార్డు 2025లో బెస్ట్ 2 లీఫ్ రేటింగ్ ను సాధించి, కృష్ణా, మచిలీపట్నం కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ డీకే బాలజీ(ఐఏఎస్) చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్పిటాలిటీ ఫెసిలిటీస్ లో స్వచ్చ గ్రీన్ లీఫ్ రేటింగ్స్ పేరిట అవార్డులను అందజేస్తుంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన వాటికి అవార్డులను అందించి ప్రోత్సాహిస్తుంది. ఎస్ఎస్ఆర్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ రావు తమ సంస్థకు ఈ అవార్డు దక్కడటం చాల ఆనందంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









