ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- October 07, 2025
మచిలీపట్నం: మచిలీపట్నంలో అందరికి సుపరిచితమైన ఎస్ఎస్ఆర్ ప్రైమ్ హోటల్ మరో ఘనతను సాధించింది. కృష్ణా జిల్లా టూరిజం డిపార్టుమెంట్ ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్రా అవార్డు 2025లో బెస్ట్ 2 లీఫ్ రేటింగ్ ను సాధించి, కృష్ణా, మచిలీపట్నం కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ డీకే బాలజీ(ఐఏఎస్) చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్పిటాలిటీ ఫెసిలిటీస్ లో స్వచ్చ గ్రీన్ లీఫ్ రేటింగ్స్ పేరిట అవార్డులను అందజేస్తుంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన వాటికి అవార్డులను అందించి ప్రోత్సాహిస్తుంది. ఎస్ఎస్ఆర్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ రావు తమ సంస్థకు ఈ అవార్డు దక్కడటం చాల ఆనందంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









