సెవా స్మార్ట్ మీటర్స్తో అక్రమాలకు చెక్
- July 21, 2016
పవర్ కన్జంప్షన్ రీడింగ్స్ని పక్కాగా తెలుసుకునేందుకు షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సెవా) స్మార్ట్ మీటర్లను అమల్లోకి తెచ్చింది. ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులకు తొలివిడతలో 5000 స్మార్ట్ మీటర్లను అమర్చింది. పలు ఫేజ్లలో మొత్తం అన్ని చోట్లా ఈ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టనున్నట్లు షార్జా మునిసిపాలిటీ వెల్లడించింది. సెవా 2020 ప్లాన్లో భాగంగా ఈ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టినట్లు సుప్రీం కౌన్సిల్ మెంబర్, రూలర్ ఆఫ్ షార్జా డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి చెప్పారు. సెవా ఇటీవలే మువైలా, అల్ సువైహీన్, అల్ హమిరియ్ ఫ్రీ జోన్ తదితర ప్రాంతాల్లో ఇటీవల ఇన్స్టాల్ చేసిన 8000 స్మార్ట్ మీటర్స్ బాగా పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖచ్చితమైన రీడింగ్ ఈ స్మార్ట్ మీటర్ల సొంతమని చెబుతూ, ఎటువంటి అక్రమాలూ ఇకపై జరగకుండా ఉంటాయని అధికారులు వివరించారు. షార్జా రెసిడెంట్స్ కూడా స్మార్ట్ మీటర్స్ని స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







