షార్జా రోడ్లపై కొత్త రాడార్స్
- July 21, 2016షార్జా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక నుంచి రోడ్లపై కొత్త రాడార్ల ద్వారా వాహనాల రాకపోకల్ని గమనిస్తారు. సేఫ్ డిస్టెన్స్ని లెక్క చేయకుండా వాహనాల్ని ఈ రాడార్లు గురించి, సమాచారం అందిస్తాయి. ఆ సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు, వాహనదారులకు జరీమానాలు విధించడం, నిబంధనలకు అనుగుణంగా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రోడ్లపై ఉన్న రాడార్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందినవే అయినా, కార్ల మధ్య దూరాన్ని పసిగట్టే ప్రోగ్రామ్ వీటికి చేయలేదు. కొత్త రాడార్లతో ఆ లోటు తీరుతుంది. వాహనానికీ మరో వాహనానికీ మధ్య దూరం విషయంలో నిబంధనల్ని పాటించని డ్రైవర్లకు 400 దిర్హామ్ల ఫైన్తోపాటు 4 బ్లాక్ పాయింట్స్ అతని ట్రాఫిక్ రికార్డ్లో చేర్చబడతాయి. రోడ్లపై రెక్లెస్గా డ్రైవ్ చేసేవారి పట్ల ఈ రాడార్లు ఉక్కుపాదం మోపుతాయనడం నిస్సందేహం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ