అతి తీవ్ర ఉష్ణోగ్రతలపై హెచ్చరిక
- July 21, 2016
దుబాయ్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వీకెండ్ పెరిగే ఉష్ణోగ్రతల వల్ల రెసిడెంట్స్కి ఇబ్బందులు తప్పకపోవచ్చనీ, రెసిడెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలు సుమారుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటాయని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని, వాటి కారణంగా జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. వెస్టర్న్ రీజియన్లో ఈ వర్షాల కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని అధికారులు వివరించారు. రానున్న రెండు రోజుల్లో సముద్రం ఒకింత అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు