అతి తీవ్ర ఉష్ణోగ్రతలపై హెచ్చరిక
- July 21, 2016
దుబాయ్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వీకెండ్ పెరిగే ఉష్ణోగ్రతల వల్ల రెసిడెంట్స్కి ఇబ్బందులు తప్పకపోవచ్చనీ, రెసిడెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలు సుమారుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటాయని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని, వాటి కారణంగా జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. వెస్టర్న్ రీజియన్లో ఈ వర్షాల కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని అధికారులు వివరించారు. రానున్న రెండు రోజుల్లో సముద్రం ఒకింత అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







