అతి తీవ్ర ఉష్ణోగ్రతలపై హెచ్చరిక
- July 21, 2016
దుబాయ్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వీకెండ్ పెరిగే ఉష్ణోగ్రతల వల్ల రెసిడెంట్స్కి ఇబ్బందులు తప్పకపోవచ్చనీ, రెసిడెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉష్ణోగ్రతలు సుమారుగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటాయని అధికారులు చెప్పారు. తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని, వాటి కారణంగా జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. వెస్టర్న్ రీజియన్లో ఈ వర్షాల కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని అధికారులు వివరించారు. రానున్న రెండు రోజుల్లో సముద్రం ఒకింత అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ