ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు..

- July 22, 2016 , by Maagulf
ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు..

తంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో 29 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం మధ్యాహ్నం గగనతలంలో అదృశ్యమైంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు.కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సివుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com