కబాలి సినిమా టికెట్లు పంచిపెట్టిన కిరణ్ బేడీ

- July 22, 2016 , by Maagulf
కబాలి సినిమా టికెట్లు పంచిపెట్టిన కిరణ్ బేడీ

కబాలి సినిమా మానియా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత గవర్నర్ చేత కూడా ఆశ్చర్యకరమైన పని చేయించింది. స్వయంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పిన ఘటన పాండిచ్చేరిలో జరిగింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బీజేపీ పార్టీ తరుపున ఎంపికైన కిరణ్ బేడి పాండిచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ప్రజలను అభివృద్ది వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సొంత ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం కబాలి ప్రభావం దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. సొంత ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టెకెట్లు ఇచ్చారు. కబాలి మానియా దాదాపు దక్షిణ భారతదేశమంతటా వైరల్‌గా ఉంది. తమిళనాడు, పాండిచ్చేరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ ప్రజల్లో ఉండే ఈ క్రేజ్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ విధంగా వినియోగించారు పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com