కబాలి సినిమా టికెట్లు పంచిపెట్టిన కిరణ్ బేడీ
- July 22, 2016
కబాలి సినిమా మానియా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత గవర్నర్ చేత కూడా ఆశ్చర్యకరమైన పని చేయించింది. స్వయంగా లెఫ్ట్నెంట్ గవర్నర్ కబాలి సినిమా టెకెట్లను ప్రజలకిచ్చి మూవీ చూడమని చెప్పిన ఘటన పాండిచ్చేరిలో జరిగింది. లెఫ్ట్నెంట్ గవర్నర్గా బీజేపీ పార్టీ తరుపున ఎంపికైన కిరణ్ బేడి పాండిచ్చేరిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె ప్రజలను అభివృద్ది వైపు నడిపించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సొంత ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించుకున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం కబాలి ప్రభావం దక్షిణ భారతం మొత్తం ఆవహించి ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆమె అందుకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నారు. సొంత ఇళ్లలో టాయిలెట్లు కట్టించుకున్న వారికి ప్రోత్సాహకంగా కబాలి టెకెట్లు ఇచ్చారు. కబాలి మానియా దాదాపు దక్షిణ భారతదేశమంతటా వైరల్గా ఉంది. తమిళనాడు, పాండిచ్చేరిలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈ ప్రజల్లో ఉండే ఈ క్రేజ్ను లెఫ్ట్నెంట్ గవర్నర్ ఈ విధంగా వినియోగించారు పాండిచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







