జార్ఖండ్‌లో మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు అరెస్ట్ చేసిన సీబీఐ

- July 22, 2016 , by Maagulf
జార్ఖండ్‌లో  మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు అరెస్ట్ చేసిన సీబీఐ

ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిని సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. పండిట్ స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ బర్మన్‌ను జార్ఖండ్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాయ్, బర్మన్‌తో కలిసి 2015 మే నెలలో ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. ఆగస్ట్ 15 వేడుకల్లో సంగీత కచేరి నిర్వహించాలని ప్రధాని మోదీ తనకు లేఖ రాసినట్లు అధికారులకు చూపాడు.
అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు దానిపై పీఎంవో కార్యాలయం నుంచి ఆరా తీశారు. దీంతో అది ఫోర్జరీ లేఖగా తేలింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగాల్‌లో వారు ఫోర్జరీకి పాల్పడిన మరి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సీబీఐ కోర్టులో హాజరుపర్చగా జులై 27 వరకు కస్టడీకి అనుమతించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com