సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- October 22, 2025
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను అధికారులు అరెస్టు చేశారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) తెలిపింది. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని అథారిటీ హెచ్చరించింది.
అరెస్టయిన వారిలో పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు అవినీతికి సహకరించిన పౌరులను కూడా అరెస్టు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. అరెస్టయిన వారిలో ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారుడి యాజమాన్యంలోని కంపెనీకి క్రషర్ లైసెన్స్ ను చట్టవిరుద్ధంగా మంజూరు చేసి SR1,625,000 మొత్తాన్ని లంచంగా స్వీకరించిన పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఉన్నారు. ఒక గవర్నరేట్ మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చట్టవిరుద్ధంగా వాణిజ్య సంస్థకు టెండర్ జారీ చేసి SR195,000 తీసుకున్న వ్యక్తి ఉన్నారని వెల్లడించారు. వీళ్లతోపాటు పలు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ.. తమ విధులను దుర్వినియోగం చేస్తూ పట్టుబడిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







