యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- October 22, 2025
యూఏఈ: దీపావళి సందర్భంగా యూఏఈలో బంగారు నాణేలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ఈ సంవత్సరం బంగారం ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి చిన్న సైజు నాణేలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని ఉందని దుబాయ్లోని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. చాలా మంది వినియోగదారులు బహుమతి మరియు లక్ష్మీ పూజ కోసం బంగారు కాయిన్ లను కొనడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగ రోజు ఐదు మరియు 10 గ్రాముల నాణేలకు సంబంధించి డిమాండ్ అధికంగా ఉందని మీనా జ్యువెలర్స్ భాగస్వామి సంజయ్ జెత్వానీ అన్నారు.
మరోవైపు దీపావళి సమయంలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ పండుగ రోజు ధరలు 4.5 శాతం పడిపోయింది. ఔన్సుకు $4,381 నుండి $4,142.75 కు తగ్గిందని సిరోయా జ్యువెలర్స్ యజమాని చందు సిరోయా తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రజలు పెట్టుబడి కోసం బంగారు నాణేలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆభరణాల కంటే నాణేలకు ప్రాధాన్యత ఇచ్చారని, దాంతో బంగారు నాణేలకు డిమాండ్ చాలా బలంగా ఉందని బఫ్లెహ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ వోరా తెలిపారు. ముఖ్యంగా ధన్ తేరాస్ తోపాటు దీపావళి కి ముందు బంగారు నాణేల కొనుగోళ్లలో తాము పెరుగుదలను చూశామని వెల్లడించారు.
కాగా, దీపావళి మరియు ధంతేరాస్ సమయంలో బంగారు నాణేలకు బలమైన డిమాండ్ ఉంటుందని తాము ముందుగానే ఊహించామని , అందుకు తగినట్టుగా ప్రతి కస్టమర్ అవసరాలను సజావుగా బంగారాన్ని అందించగలిగామని మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్లాల్ అహ్మద్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







