కైకాలకి సరైన మర్యాద ఇవ్వడంలేదని వాపోతున్నారు..
- July 23, 2016
తెలుగు చిత్రపరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి విగ్రహం, డైలాగ్ లో నిగ్రహం ఉన్న నటుడుగా జనం ఆదరణ పొందాడాయన.
'శారద'లో కంటతడి పెట్టించిన అన్నయ్య'తాత- మనవడు'లో నిర్దయుడైన కొడుకు'జ్యోతి'లో ఆర్ద్రత నిండినతండ్రి'శుభలేఖ'లో జిత్తులమారి నాయకుడు'యమగోల'లో మెత్తటి మనసు కలిగిన యముడు
వెరసి. నవరస నటనా సార్వభౌముడుఅతడే.. కైకాల సత్యనారాయణ. చివరగా రవితేజ "దరువు" చిత్రంలో కనిపించారు. తాజాగా, ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు చెందిన అనేక విషయాలని పంచుకొన్నారు. అయితే, తనకి సరైన గౌరవం ఇవ్వడంలేదని వాపోతున్నారు కైకాల. ఓ సినిమా ప్రివ్యూకి పిలుస్తున్నారా? ఫంక్షన్కి పిలుస్తున్నారా..?? అవార్డు ఫంక్షన్స్కేమైనా పిలుస్తున్నారా.. ??? టీవీలో సినిమా ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు 'అరె.. ఇదెప్పుడు జరిగింది? కనీసం మనల్ని పిలవను కూడా లేదే' అని ఫీలైపోతున్నాడంట. పిలుస్తే వస్తారా.. ? అంటే ఓస్.. ఎందుకురానండీ. ఖచ్చితంగా అంటున్నారు. మరి.. ఇకనైనా సినీ పరిశ్రమ కైకాలకి సరైన మర్యాద ఇస్తుందని ఆశిద్ధాం..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







