కైకాలకి సరైన మర్యాద ఇవ్వడంలేదని వాపోతున్నారు..

- July 23, 2016 , by Maagulf
కైకాలకి సరైన మర్యాద ఇవ్వడంలేదని వాపోతున్నారు..

తెలుగు చిత్రపరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి విగ్రహం, డైలాగ్‌ లో నిగ్రహం ఉన్న నటుడుగా జనం ఆదరణ పొందాడాయన.
'శారద'లో కంటతడి పెట్టించిన అన్నయ్య'తాత- మనవడు'లో నిర్దయుడైన కొడుకు'జ్యోతి'లో ఆర్ద్రత నిండినతండ్రి'శుభలేఖ'లో జిత్తులమారి నాయకుడు'యమగోల'లో మెత్తటి మనసు కలిగిన యముడు
వెరసి. నవరస నటనా సార్వభౌముడుఅతడే.. కైకాల సత్యనారాయణ. చివరగా రవితేజ "దరువు" చిత్రంలో కనిపించారు. తాజాగా, ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు చెందిన అనేక విషయాలని పంచుకొన్నారు. అయితే, తనకి సరైన గౌరవం ఇవ్వడంలేదని వాపోతున్నారు కైకాల. ఓ సినిమా ప్రివ్యూకి పిలుస్తున్నారా? ఫంక్షన్‌కి పిలుస్తున్నారా..?? అవార్డు ఫంక్షన్స్‌కేమైనా పిలుస్తున్నారా.. ??? టీవీలో సినిమా ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు 'అరె.. ఇదెప్పుడు జరిగింది? కనీసం మనల్ని పిలవను కూడా లేదే' అని ఫీలైపోతున్నాడంట. పిలుస్తే వస్తారా.. ? అంటే ఓస్.. ఎందుకురానండీ. ఖచ్చితంగా అంటున్నారు. మరి.. ఇకనైనా సినీ పరిశ్రమ కైకాలకి సరైన మర్యాద ఇస్తుందని
ఆశిద్ధాం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com