కువైట్ ఇ-వీసా సర్వీస్ ప్రారంభం
- July 23, 2016
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా, ఎలక్ట్రానిక్ వీసా సిస్టమ్ని కువైట్ ఇంటర్నేసనల్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ప్రయాణీకులు వీసా పొందేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు మినిస్టర్ షేక్ మొహమ్మద్ చెప్పారు. ఈ విధానంలోని అన్ని సౌకర్యాల్నీ మినిస్టర్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నిపుణులైనవారితో ఈ సౌకర్యాన్ని ప్రయాణీకులకు ఎలాంటి సమస్యలూ లేకుండా అందుబాటులో ఉంచాలని మినిస్టర్ అధికారులకు సూచించారు. వలసదారులకోసం ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడ్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి చెప్పారు. 13 ప్రొఫెషన్స్కి ప్రత్యేక సర్వీసులను అందిస్తున్నామనీ, అలాగే ఆరు నెలలకు మించి రెసిడెన్సీ వీసాను వలసదారులకోసం అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఎయిర్పోర్ట్లోని పలు సెక్టార్లలో మంత్రితో కలిసి మేజర్ జనరల్ కలియతిరిగారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







