28 తర్వాత కలిసిన పేగుబంధం

- July 23, 2016 , by Maagulf
28 తర్వాత కలిసిన పేగుబంధం

హైదరాబాద్‌ పోలీస్‌ ఆరు నెలలపాటు శ్రమించి దుబాయ్‌కి చెందిన మహిళల్ని, వారి తల్లితో కలిపారు. తల్లి నుంచి 28 ఏళ్ళ క్రితం విడిపోయిన అయేషా మరియు ఫాతిమా రసీద్‌ ఇటీవల హైదరాబాద్‌కి వెళ్ళి తమ తల్లి గురించిన సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరారు. పోలీసులు ఆరు నెలలపాటు శ్రమించి 60 ఏళ్ళ నజియా బేగమ్‌ని కనుగొన్నారు. ఆమెను, తన కుమార్తెలతో కలిపేందుకు పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా అయేషా, ఫాతిమాతోపాటు నజియా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తమ తల్లిని దుబాయ్‌కి పంపేశారనీ, అప్పటినుంచీ తాము తండ్రి వద్దే ఉండిపోయామని తెలిపారు. కర్నాటకలోని బీదర్‌లో ఫ్రూట్‌ సెల్లర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని నజియా తిరిగి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కలిగారు. తమ తల్లిని జీవితంలో కలుసుకోలేమనుకున్నామనీ అయితే హైదరాబాద్‌ పోలీసుల చొరవతో తల్లిని కలుసుకోగలిగామని అయేషా చెప్పారు. ఇన్నేళ్ళుగా తల్లికి దూరంగా ఉండి చాలా బాధపడ్డామనీ ఇకపై తమ తల్లిని బాగా చూసుకుంటామని పాతిమా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com