28 తర్వాత కలిసిన పేగుబంధం
- July 23, 2016
హైదరాబాద్ పోలీస్ ఆరు నెలలపాటు శ్రమించి దుబాయ్కి చెందిన మహిళల్ని, వారి తల్లితో కలిపారు. తల్లి నుంచి 28 ఏళ్ళ క్రితం విడిపోయిన అయేషా మరియు ఫాతిమా రసీద్ ఇటీవల హైదరాబాద్కి వెళ్ళి తమ తల్లి గురించిన సమాచారాన్ని తెలపాల్సిందిగా కోరారు. పోలీసులు ఆరు నెలలపాటు శ్రమించి 60 ఏళ్ళ నజియా బేగమ్ని కనుగొన్నారు. ఆమెను, తన కుమార్తెలతో కలిపేందుకు పోలీసులు సహకరించారు. ఈ సందర్భంగా అయేషా, ఫాతిమాతోపాటు నజియా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తమ తల్లిని దుబాయ్కి పంపేశారనీ, అప్పటినుంచీ తాము తండ్రి వద్దే ఉండిపోయామని తెలిపారు. కర్నాటకలోని బీదర్లో ఫ్రూట్ సెల్లర్గా పనిచేస్తున్న వ్యక్తిని నజియా తిరిగి వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఆ తర్వాత కలిగారు. తమ తల్లిని జీవితంలో కలుసుకోలేమనుకున్నామనీ అయితే హైదరాబాద్ పోలీసుల చొరవతో తల్లిని కలుసుకోగలిగామని అయేషా చెప్పారు. ఇన్నేళ్ళుగా తల్లికి దూరంగా ఉండి చాలా బాధపడ్డామనీ ఇకపై తమ తల్లిని బాగా చూసుకుంటామని పాతిమా చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







