ఎస్డీఎఫ్ అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నా ఐసిస్
- July 23, 2016
ఐసిస్ ఉగ్రభూతం సిరియా వాసులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇటీవల టర్కీ - రఖా మధ్యలో వ్యూహాత్మక ప్రాంతమైన మన్బిజ్ వద్ద డజన్ల కొద్దీ పౌరులను సంకీర్ణ దళాలు హతమార్చినట్లు ఆరోపణలు రావడంపై వారు వివరణ ఇచ్చారు.
ఇటీవల మన్బిజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో 11 మంది పిల్లలతో సహా 56మంది పౌరులు మృతిచెందినట్లు బ్రిటన్కు చెందిన ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆరోపించింది. దీంతో సంకీర్ణ దళాలు దీనిపై విచారణ చేపట్టాయి. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్(ఎస్డీఎఫ్) కాల్పులను అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నాయని తేలినట్లు కల్నల్ క్రిస్ గార్వెర్ తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఎస్డీఎఫ్ దళాలకు ఎదురుపడ్డారన్నారు. వారు దాడికి సిద్ధమవుతుండటంతో ఎస్డీఎఫ్ దళాలు వారు ఉంటున్న భవనాలు, వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశాయి. అనంతరం అక్కడి పరిస్థితినిబట్టి ఉగ్రవాదులు పౌరులతో కలిసిపోయి దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని గార్వెర్ తెలిపారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







