ఎస్డీఎఫ్ అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నా ఐసిస్
- July 23, 2016
ఐసిస్ ఉగ్రభూతం సిరియా వాసులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. ఇటీవల టర్కీ - రఖా మధ్యలో వ్యూహాత్మక ప్రాంతమైన మన్బిజ్ వద్ద డజన్ల కొద్దీ పౌరులను సంకీర్ణ దళాలు హతమార్చినట్లు ఆరోపణలు రావడంపై వారు వివరణ ఇచ్చారు.
ఇటీవల మన్బిజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో 11 మంది పిల్లలతో సహా 56మంది పౌరులు మృతిచెందినట్లు బ్రిటన్కు చెందిన ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆరోపించింది. దీంతో సంకీర్ణ దళాలు దీనిపై విచారణ చేపట్టాయి. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్(ఎస్డీఎఫ్) కాల్పులను అడ్డుకునేందుకు స్థానికులను మానవకవచాలుగా వాడుకుంటున్నాయని తేలినట్లు కల్నల్ క్రిస్ గార్వెర్ తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో ఐసిస్ ఉగ్రవాదులు ఎస్డీఎఫ్ దళాలకు ఎదురుపడ్డారన్నారు. వారు దాడికి సిద్ధమవుతుండటంతో ఎస్డీఎఫ్ దళాలు వారు ఉంటున్న భవనాలు, వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశాయి. అనంతరం అక్కడి పరిస్థితినిబట్టి ఉగ్రవాదులు పౌరులతో కలిసిపోయి దాడికి ప్రయత్నించినట్లు తేలిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని గార్వెర్ తెలిపారు
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









