మనమంతా. ఆగస్టు 5న విడుదల
- July 23, 2016
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఆగస్టు 5న విడుదల కాబోతున్నఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది.
మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమా ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియర నటి గౌతమి సహా గౌత మి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.
మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మనమంతా. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







