మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- October 26, 2025
కువైట్ః మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రతా క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 263 మందిని అరెస్టు చేసినట్టు పబ్లిక్ భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ తెలిపారు. షేక్ ఫహద్ అల్-యూసెఫ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







