బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ ఇకపై కఠినం కానుంది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి ఒక ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు రానుంది. ఇకపై బహ్రెనైజేషన్ ఆధారంగానే ఆయా సంస్థలు వీదేశీ స్టాఫ్ కు వీసాలు జారీ చేయాలని అందులో ప్రతిపాదించారు. ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన.. అర్హత కలిగిన బహ్రెయిన్లకు మొదటగా ఉద్యోగాలు కల్పించాలని పిలుపునిస్తుంది.
ఇప్పటికే లేబర్ మార్కెట్ లో శిక్షణ పొందిన బహ్రెయిన్ లు ఉన్నారని, అయితే స్పష్టమైన నియామక ప్రణాళిక లేకపోవడం వారి పాత్రను పరిమితం చేసిందని పేర్కొన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అర్హత కలిగిన బహ్రెయిన్ల జాతీయ డేటాబేస్ లో నమోదైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన నిర్దేశిస్తుంది. తగిన సామర్థ్యాలు కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేని చోట మాత్రమే తాత్కాలికంగా విదేశీయులను నియమించాలని సూచించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







