బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ ఇకపై కఠినం కానుంది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి ఒక ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు రానుంది. ఇకపై బహ్రెనైజేషన్ ఆధారంగానే ఆయా సంస్థలు వీదేశీ స్టాఫ్ కు వీసాలు జారీ చేయాలని అందులో ప్రతిపాదించారు. ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన.. అర్హత కలిగిన బహ్రెయిన్లకు మొదటగా ఉద్యోగాలు కల్పించాలని పిలుపునిస్తుంది.
ఇప్పటికే లేబర్ మార్కెట్ లో శిక్షణ పొందిన బహ్రెయిన్ లు ఉన్నారని, అయితే స్పష్టమైన నియామక ప్రణాళిక లేకపోవడం వారి పాత్రను పరిమితం చేసిందని పేర్కొన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అర్హత కలిగిన బహ్రెయిన్ల జాతీయ డేటాబేస్ లో నమోదైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన నిర్దేశిస్తుంది. తగిన సామర్థ్యాలు కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేని చోట మాత్రమే తాత్కాలికంగా విదేశీయులను నియమించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







