బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ ఇకపై కఠినం కానుంది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించి ఒక ప్రతిపాదన పార్లమెంట్ ముందుకు రానుంది. ఇకపై బహ్రెనైజేషన్ ఆధారంగానే ఆయా సంస్థలు వీదేశీ స్టాఫ్ కు వీసాలు జారీ చేయాలని అందులో ప్రతిపాదించారు. ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన.. అర్హత కలిగిన బహ్రెయిన్లకు మొదటగా ఉద్యోగాలు కల్పించాలని పిలుపునిస్తుంది.
ఇప్పటికే లేబర్ మార్కెట్ లో శిక్షణ పొందిన బహ్రెయిన్ లు ఉన్నారని, అయితే స్పష్టమైన నియామక ప్రణాళిక లేకపోవడం వారి పాత్రను పరిమితం చేసిందని పేర్కొన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు అర్హత కలిగిన బహ్రెయిన్ల జాతీయ డేటాబేస్ లో నమోదైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదన నిర్దేశిస్తుంది. తగిన సామర్థ్యాలు కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేని చోట మాత్రమే తాత్కాలికంగా విదేశీయులను నియమించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!







