హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- October 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ రంగంలో మరో గ్లోబల్ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అమెరికా వెలుపల మెక్డొనాల్డ్స్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెక్డొనాల్డ్స్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఉపాధి లభించనుంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







