హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- October 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ రంగంలో మరో గ్లోబల్ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అమెరికా వెలుపల మెక్డొనాల్డ్స్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెక్డొనాల్డ్స్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఉపాధి లభించనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







