నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో ఫేక్ ఎంప్లాయిమెంట్, సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు 10వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్ష తోపాటు వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించింది.
2022 మరియు 2024 మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) నుండి 3 వేల 199 దినార్ల ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు రెండు కల్పిత కంపెనీల కింద 55 మంది కార్మికులను నమోదు చేసి, ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







