నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో ఫేక్ ఎంప్లాయిమెంట్, సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు 10వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్ష తోపాటు వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించింది.
2022 మరియు 2024 మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) నుండి 3 వేల 199 దినార్ల ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు రెండు కల్పిత కంపెనీల కింద 55 మంది కార్మికులను నమోదు చేసి, ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









