నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!

- October 30, 2025 , by Maagulf
నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!

మనామా: బహ్రెయిన్ లో ఫేక్ ఎంప్లాయిమెంట్, సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు 10వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్ష తోపాటు వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పున  జరిమానా విధించింది.

2022 మరియు 2024 మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) నుండి 3 వేల 199 దినార్ల ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు రెండు కల్పిత కంపెనీల కింద 55 మంది కార్మికులను నమోదు చేసి, ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com