కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- October 30, 2025
కువైట్: కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ కేసు కలకలం లేపుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసును న్యాయమూర్తి నాజర్ సలేం అల్-హైద్ అధ్యక్షతన న్యాయమూర్తులు ముతైబ్ అల్-ఆరాధి మరియు మొహమ్మద్ అల్-సనియా సభ్యులుగా ఉన్న అప్పీల్స్ కోర్టు విచారించింది. HIV మరియు హెపటైటిస్ రక్త పరీక్ష ఫలితాలను తప్పుగా చూపించడానికి, నకిలీ "మంచి ఆరోగ్య" ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఉద్యోగులకు KD 200 లంచం ఇచ్చినందుకు ఒక ప్రవాసికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
సేకరణ కేంద్రాలు మరియు ప్రయోగశాలల మధ్య రవాణా సమయంలో రక్త నమూనాలను తారుమారు చేయడం ఫోర్జరీ పథకంలో భాగంగా నిందితులు చేసేవారు. పరీక్ష ఫలితాలను తారుమారు చేయడానికి లంచాలు చెల్లించారని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఫర్ మానిటరింగ్ ప్రవాసుల నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందగానే, నలుగురు ప్రవాసులకు అత్యవసరంగా తిరిగి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఇద్దరు హెపటైటిస్ బి పాజిటివ్ కేసులు, ఇద్దరు హెపటైటిస్ సి పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అయితే క్షయవ్యాధి పరీక్షలు నెగటివ్గా వచ్చాయి.
కేసును విచారించిన అధికారులు, ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న ప్రవాస ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్తో కూడిన ముఠాను అరెస్టు చేశారు. విదేశాలలో నకిలీ వ్యాపారం ప్రారంభమైందని, అక్కడ ఒక మహిళ వైద్య నివేదికలపై అధికారిక స్టాంపులను నకిలీ చేసిందని పాజిటివ్ కేసులను నెగటివ్ గా గుర్తించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







