కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- October 30, 2025
కువైట్: కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ కేసు కలకలం లేపుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసును న్యాయమూర్తి నాజర్ సలేం అల్-హైద్ అధ్యక్షతన న్యాయమూర్తులు ముతైబ్ అల్-ఆరాధి మరియు మొహమ్మద్ అల్-సనియా సభ్యులుగా ఉన్న అప్పీల్స్ కోర్టు విచారించింది. HIV మరియు హెపటైటిస్ రక్త పరీక్ష ఫలితాలను తప్పుగా చూపించడానికి, నకిలీ "మంచి ఆరోగ్య" ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఉద్యోగులకు KD 200 లంచం ఇచ్చినందుకు ఒక ప్రవాసికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
సేకరణ కేంద్రాలు మరియు ప్రయోగశాలల మధ్య రవాణా సమయంలో రక్త నమూనాలను తారుమారు చేయడం ఫోర్జరీ పథకంలో భాగంగా నిందితులు చేసేవారు. పరీక్ష ఫలితాలను తారుమారు చేయడానికి లంచాలు చెల్లించారని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఫర్ మానిటరింగ్ ప్రవాసుల నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందగానే, నలుగురు ప్రవాసులకు అత్యవసరంగా తిరిగి పరీక్షలు నిర్వహించగా, వారిలో ఇద్దరు హెపటైటిస్ బి పాజిటివ్ కేసులు, ఇద్దరు హెపటైటిస్ సి పాజిటివ్ కేసులు నిర్ధారించారు. అయితే క్షయవ్యాధి పరీక్షలు నెగటివ్గా వచ్చాయి.
కేసును విచారించిన అధికారులు, ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న ప్రవాస ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్తో కూడిన ముఠాను అరెస్టు చేశారు. విదేశాలలో నకిలీ వ్యాపారం ప్రారంభమైందని, అక్కడ ఒక మహిళ వైద్య నివేదికలపై అధికారిక స్టాంపులను నకిలీ చేసిందని పాజిటివ్ కేసులను నెగటివ్ గా గుర్తించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









