GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- October 30, 2025
దుబాయ్: దుబాయ్ లోన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA దుబాయ్) ప్రతిష్టాత్మకమైన "బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ స్ట్రాటజీ ఆఫ్ 2025" అవార్డును గెలుచుకుంది. మానవ శ్రేయస్సు కేంద్రంగా అధునాతన సాంకేతికతలను బాధ్యతాయుతంగా అమలుకు దక్కిన ఫలితమని GDRFA దుబాయ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి హర్షం వ్యక్తం చేశారు. తమకు ఏఐ అనేది ఒక టెక్నాలజీ కంటే ఎక్కువని తెలిపారు. ఇది బాధ్యత, పారదర్శకత,జీవన నాణ్యతను మరియు ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి నిబద్ధతను కలిగి ఉన్న జాతీయ వ్యూహం అని వివరించారు.
తన నాయకత్వంలో GDRFA దుబాయ్ భవిష్యత్తు కోసం దుబాయ్ సంసిద్ధతకు మద్దతు ఇస్తూనే కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సురక్షితమై పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం AI ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ అవార్డుతో టెక్నాలజీ, డిజిటల్ పాలన మరియు స్థిరమైన ఆవిష్కరణలకు దుబాయ్ కేంద్రంగా మారిందని తేటతెల్లం అయిందని, ప్రపంచ కేంద్రంగా ఎమిరేట్ ఖ్యాతిని కూడా బలోపేతం చేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







