ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- October 30, 2025
దోహా: ఖతార్ లో ఆహార సంబంధ కార్యాకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా షాపింగ్ కేంద్రాలు మరియు పర్యాటక ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లపై ప్రత్యేకంగా కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆయా ఫుడ్ రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.
దాదాపు 545 రెస్టారెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 634 నమూనాలను సేకరించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిని ఆహార భద్రతా ప్రయోగశాలలలో పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. కాగా, అందులో అన్ని పదార్థాలు పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారణ అయిందని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!









