ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- October 30, 2025
దోహా: ఖతార్ లో ఆహార సంబంధ కార్యాకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా షాపింగ్ కేంద్రాలు మరియు పర్యాటక ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లపై ప్రత్యేకంగా కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆయా ఫుడ్ రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.
దాదాపు 545 రెస్టారెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 634 నమూనాలను సేకరించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిని ఆహార భద్రతా ప్రయోగశాలలలో పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. కాగా, అందులో అన్ని పదార్థాలు పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారణ అయిందని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







