ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- October 30, 2025
దోహా: ఖతార్ లో ఆహార సంబంధ కార్యాకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా షాపింగ్ కేంద్రాలు మరియు పర్యాటక ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక బ్రాండ్ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లపై ప్రత్యేకంగా కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆయా ఫుడ్ రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.
దాదాపు 545 రెస్టారెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 634 నమూనాలను సేకరించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిని ఆహార భద్రతా ప్రయోగశాలలలో పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. కాగా, అందులో అన్ని పదార్థాలు పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారణ అయిందని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









