మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- November 01, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt), మైనారిటీ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తను అందించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ (TET) కోచింగ్ ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమ,శాఖ మంత్రి ఫరూక్ ప్రకటించారు.ఈ శిక్షణ ద్వారా రాష్ట్రంలోని మైనారిటీ అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాన్ని పొందనున్నారు.
మంత్రి ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలో విశేష ఫలితాలు సాధించింది. ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం మైనారిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.తమ వివరాలను https://apcedmmwd.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరగనుంది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







