బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతమైంది. భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన జరిగిన ఓపెన్ హౌస్ లో పలువురు భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులతో పాటు వివిధ కమ్యూనిటీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు.
రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను చేయించడం ద్వారా రాయబారి జాకబ్ కార్యకలాపాలను ప్రారంభించారు. కమ్యూనిటీ సభ్యులు తమ పాస్పోర్ట్ల చెల్లుబాటును నిరంతరం తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా లాజిస్టికల్ సమస్యలు లేదా అసౌకర్యాన్ని నివారించడానికి సకాలంలో వారి పాస్ పోర్టులను రెన్యూవల్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇండియన్ ఎంబసీ బాధిత భారతీయ పౌరులకు మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
బాధితులకు అవసరమైన బోర్డింగ్ మరియు వసతి అందించడం, అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేయడం, విమాన టిక్కెట్లు ఏర్పాటు చేయడం, ప్రవాసుల మృత దేహాల రవాణాకు సహాయం అందించడం వంటి సేవలను ఎంబసీ అందజేస్తుందని వివరించారు. భారత ప్రభుత్వ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ హౌస్ సందర్భంగా పలు కేసులను వెంటనే పరిష్కరించామని, మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









