‘శంబాల’ ట్రైలర్ రిలీజ్..
- November 01, 2025
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా.
ఇప్పటికే శంబాల సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా శంబాల ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శంబాల ట్రైలర్ చూసేయండి.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊరిలో ఆకాశం నుంచి వచ్చి ఏదో రాయి పడుతుంది. అది పడ్డ దగ్గర్నుంచి అక్కడ మనుషులు చనిపోవడం, వింత సమస్యలు వస్తుంటాయి. దాన్ని పరిశీలించడానికి జియో సైంటిస్ట్ అయిన ఆది వెళ్తాడు. మరి ఆ ఊళ్ళో ఆది ఎదుర్కున్న సమస్యలు ఏంటి అని సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
శంబాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







