‘శంబాల’ ట్రైలర్ రిలీజ్..
- November 01, 2025
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా.
ఇప్పటికే శంబాల సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా శంబాల ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శంబాల ట్రైలర్ చూసేయండి.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊరిలో ఆకాశం నుంచి వచ్చి ఏదో రాయి పడుతుంది. అది పడ్డ దగ్గర్నుంచి అక్కడ మనుషులు చనిపోవడం, వింత సమస్యలు వస్తుంటాయి. దాన్ని పరిశీలించడానికి జియో సైంటిస్ట్ అయిన ఆది వెళ్తాడు. మరి ఆ ఊళ్ళో ఆది ఎదుర్కున్న సమస్యలు ఏంటి అని సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
శంబాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







