‘శంబాల’ ట్రైలర్ రిలీజ్..
- November 01, 2025
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా.
ఇప్పటికే శంబాల సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా శంబాల ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శంబాల ట్రైలర్ చూసేయండి.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊరిలో ఆకాశం నుంచి వచ్చి ఏదో రాయి పడుతుంది. అది పడ్డ దగ్గర్నుంచి అక్కడ మనుషులు చనిపోవడం, వింత సమస్యలు వస్తుంటాయి. దాన్ని పరిశీలించడానికి జియో సైంటిస్ట్ అయిన ఆది వెళ్తాడు. మరి ఆ ఊళ్ళో ఆది ఎదుర్కున్న సమస్యలు ఏంటి అని సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
శంబాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









