తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- November 02, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం #ArriveAlive పేరుతో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల కఠినమైన అమలు, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై దృష్టి సారించనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
పోలీసు విభాగం సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ, అవగాహన ర్యాలీలు, వర్క్షాప్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించనున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహేష్ భగవత్(శాంతిభద్రతల అదనపు డీజీపీ) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







