నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- November 02, 2025
చెన్నై: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగ సూత్రాల ప్రాముఖ్యతను మరోసారి హైలైట్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కృషి చేసిన న్యాయవ్యవస్థ సభ్యులు ఎల్లప్పుడూ ఒత్తిళ్లు, బదిలీలు, మానసిక వేధింపులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. వీఐటీ (వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు విలువైన సందేశం ఇచ్చారు.
జస్టిస్ రమణ మాట్లాడుతూ, “రాజ్యాంగం మన దేశానికి పునాది. దానిని రక్షించడమే ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగం కాపాడడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. కానీ, ఈ సూత్రాలను నిలబెట్టే జడ్జిలు తరచూ ఒత్తిడులు, బదిలీలు, బెదిరింపులు ఎదుర్కొంటారు.
నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టారు” అని చెప్పారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







