నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- November 02, 2025
చెన్నై: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగ సూత్రాల ప్రాముఖ్యతను మరోసారి హైలైట్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కృషి చేసిన న్యాయవ్యవస్థ సభ్యులు ఎల్లప్పుడూ ఒత్తిళ్లు, బదిలీలు, మానసిక వేధింపులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. వీఐటీ (వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు విలువైన సందేశం ఇచ్చారు.
జస్టిస్ రమణ మాట్లాడుతూ, “రాజ్యాంగం మన దేశానికి పునాది. దానిని రక్షించడమే ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగం కాపాడడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. కానీ, ఈ సూత్రాలను నిలబెట్టే జడ్జిలు తరచూ ఒత్తిడులు, బదిలీలు, బెదిరింపులు ఎదుర్కొంటారు.
నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టారు” అని చెప్పారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







