అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- November 02, 2025
కువైట్: కువైట్ లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. అల్-ఖైరాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాలను మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్ లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు జనరల్ సెక్యూరిటీ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ పర్యవేక్షణలో తనిఖీలను నిర్వహించాయి.
ఈ సందర్భంగా 467 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా, 10 మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిర్బంధించారు. దాదాపు 20 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను జప్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







