అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- November 02, 2025
కువైట్: కువైట్ లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. అల్-ఖైరాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాలను మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్ లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు జనరల్ సెక్యూరిటీ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ పర్యవేక్షణలో తనిఖీలను నిర్వహించాయి.
ఈ సందర్భంగా 467 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా, 10 మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిర్బంధించారు. దాదాపు 20 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను జప్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









