షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- November 03, 2025
యూఏఈ: రక్షిత యానిమల్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని షార్జా అధికారులు అరెస్టు చేశారు. అంతరించిపోతున్న కొంగలు, నక్కలు వంటి రక్షిత జంతువులను విక్రయిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న యానిమల్స్ ను షార్జా ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ రిజర్వ్స్ అథారిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో వాటిని నేచర్ రిజర్వ్ లలో వదిలేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
రక్షిత జంతువుల వ్యాపారానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద సమాచారాన్ని అందజేసి సహకరించాలని షార్జా పోలీసులు కోరారు. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రమాదకరమైన జంతువును కలిగి ఉంటే Dh10,000 నుండి ప్రారంభమై Dh500,000 వరకు జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









