షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- November 03, 2025
యూఏఈ: రక్షిత యానిమల్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని షార్జా అధికారులు అరెస్టు చేశారు. అంతరించిపోతున్న కొంగలు, నక్కలు వంటి రక్షిత జంతువులను విక్రయిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న యానిమల్స్ ను షార్జా ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ రిజర్వ్స్ అథారిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో వాటిని నేచర్ రిజర్వ్ లలో వదిలేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
రక్షిత జంతువుల వ్యాపారానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద సమాచారాన్ని అందజేసి సహకరించాలని షార్జా పోలీసులు కోరారు. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రమాదకరమైన జంతువును కలిగి ఉంటే Dh10,000 నుండి ప్రారంభమై Dh500,000 వరకు జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







